Share News

మనఊరు పిల్లల్ని మన బడిలోనే చేర్పించాలి

ABN , Publish Date - May 09 , 2025 | 11:56 PM

మనఊరు పిల్లల్ని మన బడిలోనే చేర్పిం చాలని ప్రధానోపాధ్యాయులు తాటి శ్రీ నివాసులు పిలుపునిచ్చారు.

 మనఊరు పిల్లల్ని మన బడిలోనే చేర్పించాలి
ఉపాధి కార్మికులకు ప్రభుత్వ పాఠశాల గురించి వివరిస్తున్న ఉపాధ్యాయులు

మనఊరు పిల్లల్ని మన బడిలోనే చేర్పించాలి

మునుగోడురూరల్‌, మే 9 (ఆంధ్రజ్యో తి): మనఊరు పిల్లల్ని మన బడిలోనే చేర్పిం చాలని ప్రధానోపాధ్యాయులు తాటి శ్రీ నివాసులు పిలుపునిచ్చారు. మండలంలోని పలివెల గ్రామంలో శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా గ్రామ శివారులోని చెరువులో పనిచేస్తు న్న ఉపాధి కార్మికుల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. మన ఊరు పిల్లల్ని మనబడిలో చే ర్పించాలని, ప్రైవేట్‌ పాఠశాలల ఫీజు భా రం తగ్గించుకోవాలని శ్రీనివాసులు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉం టారని, నాణ్యమైన విద్య అందిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమం లో ఉపాధ్యాయులు రఫీ, పెరిక నరసింహ, ఉయ్యాల యాద య్య, గేర నరసింహ, వెంకన్న, రాఘవేంద్ర, అంజయ్య, విద్యార్ధులు శ్రీజ, ఉమ, శృతి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 11:56 PM