Share News

సాగర్‌ ఎడమకాల్వకు నీటి విడుదల నిలిపివేత

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:46 AM

నాగార్జునసాగర్‌ ప్రా జెక్టు పరిఽధిలో ఎడమకాల్వకు గురువారం అ ర్థరాత్రి ప్రాజె క్టు అధికారు లు నీటి విడుదలను నిలిపివేశారు.

  సాగర్‌ ఎడమకాల్వకు నీటి విడుదల నిలిపివేత
నీటి విడుదల నిలిపివేసిన సాగర్‌ ఎడమకాల్వ

సాగర్‌ ఎడమకాల్వకు నీటి విడుదల నిలిపివేత

ఖమ్మం జిల్లా తాగునీటి కోసం వారం రోజుల్లో 1.7 టీఎంసీల నీటి విడుదల

నాగార్జునసాగర్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ప్రా జెక్టు పరిఽధిలో ఎడమకాల్వకు గురువారం అ ర్థరాత్రి ప్రాజె క్టు అధికారు లు నీటి విడుదలను నిలిపివేశారు. ఖమ్మం జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు పా లేరు జలాశయం నింపడానికి నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీన ఎడమకాల్వకు నీటి విడుదలను ప్రా రంభించారు. రోజుకు సుమారు 3వేల క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల చేస్తూ వారం రోజుల్లో 1.7 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రానికి సాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం 545.30 అడుగులుగా (199.5466టీఎంసీలు) ఉంది. సాగర్‌ నుంచి ప్రధాన జలవిద్యుత కేంద్రం ద్వారా 4144 క్యూసెక్కుల నీటిని, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1100క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 5244 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా ఎగువ నుంచి 1,24,800 క్యూసెక్కుల నీరు సాగర్‌కు చేరుతోంది. సా గర్‌ నుంచి కుడి, ఎడమ, వరద కాల్వలకు ఎలాంటి నీటి విడుదల లేదు.

Updated Date - Jul 12 , 2025 | 12:46 AM