Share News

బాధితులకు భరోసా కల్పించాలి

ABN , Publish Date - Oct 16 , 2025 | 11:00 PM

ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికా రులు తక్షణమే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని రామగుండం పోలీస్‌ క మిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల జోన్‌ హాజీపూర్‌ పోలీస్‌స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్‌ స్టేషన్‌ చేరు కున్న పోలీస్‌ కమిషనర్‌కు అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికా రు.

 బాధితులకు భరోసా కల్పించాలి
పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్క నాటుతున్న సీపీ

- ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి

- రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

హాజీపూర్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి) : ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికా రులు తక్షణమే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని రామగుండం పోలీస్‌ క మిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల జోన్‌ హాజీపూర్‌ పోలీస్‌స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్‌ స్టేషన్‌ చేరు కున్న పోలీస్‌ కమిషనర్‌కు అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికా రు. అనంతరం కమిషనర్‌ పోలీస్‌ సిబ్బందితో మాట్లాడి వారి విధులు, పనితీరు, స మస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్‌స్టేషన్‌ రిసె ప్షన్‌, సీసీటీఎన్‌ఎస్‌ విభాగాల పనీతీరును సంబంధిత పోలీస్‌ సిబ్బందిని శాఖపరమై న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు సంబంధించిన పలు రికా ర్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్‌ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యా ప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్‌ కమిషనర్‌ తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ, డీసీలు, మిస్సింగ్‌, ప్రా పర్టీ నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విజబుల్‌ పోలీసింగ్‌, పెట్రోలింగ్‌ నిర్వహించాలి గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకమై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్‌ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలన్నారు. ప్రతి పోలీస్‌ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధ తతో విధులు నిర్వహించాలన్నారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మ ర్యాదపూర్వకంగా వారి సమస్య వినాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రోడ్డు ప్ర మాదాలు నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తనిఖీల అనం తరం పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కను నాటా రు. ఈ తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్‌, ఏసీపీ ప్రకాష్‌, మంచిర్యాల రూరల్‌ సీఐ అశోక్‌ కుమార్‌, ఎస్‌ఐ స్వరూప్‌ రాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 11:01 PM