ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చిన గీతం వందేమాతరం
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:27 PM
స్వాతంత్య్ర పోరా టంలో ప్రజలందర్ని ఏకతాటిపైకి తెచ్చింది వందేమాతర గీతం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణం లోని మార్కెట్ రోడ్డులో సామూహిక వందేమాతర గీతాలాపన చేపట్టారు.
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : స్వాతంత్య్ర పోరా టంలో ప్రజలందర్ని ఏకతాటిపైకి తెచ్చింది వందేమాతర గీతం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణం లోని మార్కెట్ రోడ్డులో సామూహిక వందేమాతర గీతాలాపన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయం స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలందరిలో పోరాట స్ఫూర్తిని రగిలిచిందన్నారు. స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని ప్రతి ఒ క్కరు తలుచుకుంటూ వారి ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కా ర్య క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, నాయకులు గాజుల ముకేష్గౌడ్, పురషోత్తం జాజు, వంగపల్లి వెంకటేశ్వర్రావు, కృష్ణ మూర్తి, శ్రీశైలం, చక్రవర్తి, వేణుగోపాల్, కమలాకర్రావు, ప్రభాకర్, శ్రీధర్, నాగేశ్వర్రావు, తిరుపతి, వెంకటేశ్వర్లు, వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు.