Share News

పచ్చని తెలంగాణే లక్ష్యంగా వన మహోత్సవం

ABN , Publish Date - Jul 13 , 2025 | 11:51 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చద నాన్ని పెంచి ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు.

పచ్చని తెలంగాణే లక్ష్యంగా వన మహోత్సవం
మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే వినోద్‌, అధికారులు, నాయకులు

ఎమ్మెల్యే గడ్డం వినోద్‌

బెల్లంపల్లి, జూలై13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చద నాన్ని పెంచి ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. ఆదివారం మండలంలోని లంబాడితండ గురుకుల పాఠశాలలో పాతబెల్లం పల్లి గ్రామంలో అటవీశాఖ అధికారులు నిర్వహించిన వన మహోత్సవ కా ర్యక్రమానికి హాజరై మొక్కలు నాటి మాట్లాడారు. వన మహోత్సవం కార్య క్రమం కింద పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. సరైన సమయంలో వర్షాలు పడాలన్న వాతావరణం సమతుల్యం ఉండాలన్న మొ క్కలు కాపాడాలన్నారు ప్రభుత్వం ఇంటింటికీ మొక్కల పెంపకం కార్యక్రమం చేపడుతుందని మొక్కలు నాటడంతో పాటు కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అటవీశాఖ అధికారు లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 11:51 PM