Maoists, Encounter: ముగ్గురు మావోయిస్టుల ఎన్కౌంటర్
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:39 AM
ఒక మహిళా మావోయిస్టు సహా ముగ్గురు మావోయిస్టులను భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేశాయి. ఛత్తీ్సగఢ్లోని అడవుల్లో ఆదివారం జరిగిందీ ఎన్కౌంటర్. విశ్వసనీయ సమాచారం మేరకు కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని చిండ్ఖడక్..
మృతుల్లో ఒకరు మహిళా మావోయిస్టు... ఛత్తీస్గఢ్ అడవుల్లో ఘటన
చింతూరు/చర్ల, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఒక మహిళా మావోయిస్టు సహా ముగ్గురు మావోయిస్టులను భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేశాయి. ఛత్తీ్సగఢ్లోని అడవుల్లో ఆదివారం జరిగిందీ ఎన్కౌంటర్. విశ్వసనీయ సమాచారం మేరకు కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని చిండ్ఖడక్ గ్రామ సమీప కొండలపై మావోయిస్టులు ఉన్నారని కాంకేర్ ఎస్పీ ఇందిరా కల్యాణ్కు సమాచారం అందింది. దీంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ), సరిహద్దు భద్రతా దళం(బీఎ్సఎఫ్), కోబ్రా, ఎస్టీఎఫ్ బలగాలను ఆ కొండ వద్దకు పంపించారు. వీరికి మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగాయి. మృతులను సీతానది ఏరియా కమిటీ కార్యదర్శి సర్వన్ మడ్కం అలియాస్ విశ్వనాథ్, నగిరి ఏరియా కమిటీ సభ్యుడు రాజేశ్ అలియాస్ రాకేశ్ హేమ్లా, మెయిన్పూర్-నువాపాడ రక్షణ బృందం సభ్యురాలు బసంతి కుంజాం అలియాస్ హిడ్మేగా గుర్తించారు. ఘటనా స్థలంలో పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతులు ముగ్గురిపై మొత్తంగా రూ.14 లక్షల రివార్డు ఉందని బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ చెప్పారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోందన్నారు. ఛత్తీ్సగఢ్లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లలో 252 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో 223 మంది కాంకేర్ జిల్లాతో సహా బస్తర్ డివిజన్లో జరిగిన ఎన్కౌంటర్లలో చనిపోయారని పేర్కొన్నారు. కాగా, యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా ఆదివారం కేంద్ర బలగాలు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మీదుగా పూజారి కాంకేర్ అడవుల్లోకి ప్రవేశించాయి.