రేషన్ డీలర్ల సమస్యలు తీరేదేన్నడు...?
ABN , Publish Date - Aug 19 , 2025 | 10:48 PM
రేషన్ డీల ర్లు అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నారు. పాల కులకు ఏళ్ల తరబడి మొర పెట్టుకుంటున్నా మోక్షం లభించడం లేదు. నెల రోజులు శ్రమ పడితే చివరకు మిగిలేది రిక్త హస్తాలేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సమస్యలు తీరుతాయని గంపెడు ఆశలు పెట్టుకున్న డీలర్లకు నిరాశే ఎదురైంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డిమాండ్లు తీరుస్తామనే హామీలు డీలర్లను ఊరిస్తూ వచ్చాయి.
-హామీలతోనే ఏళ్లతరబడి జాప్యం
-వినతులు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
-గౌరవ వేతనం డిమాండ్ బుట్టదాఖలు
-నెలవారీ కమీషన్లూ జమకాని వైనం
-నెలంతా కష్టపడితే మిగిలేది రిక్తహస్తాలే
మంచిర్యాల, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రేషన్ డీల ర్లు అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నారు. పాల కులకు ఏళ్ల తరబడి మొర పెట్టుకుంటున్నా మోక్షం లభించడం లేదు. నెల రోజులు శ్రమ పడితే చివరకు మిగిలేది రిక్త హస్తాలేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సమస్యలు తీరుతాయని గంపెడు ఆశలు పెట్టుకున్న డీలర్లకు నిరాశే ఎదురైంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డిమాండ్లు తీరుస్తామనే హామీలు డీలర్లను ఊరిస్తూ వచ్చాయి. ఏ ఒక్క సమ స్యా తీరలేదు. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ డీ లర్లకు హామీలు గుప్పించింది. రేషన్ డీలర్లకు గౌరవ వే తనం కల్పిస్తామని మాటిచ్చింది. ఏడాది గడిచినా అది కార్యరూపం దాల్చలేదు. ఇలా ఎన్నో సమస్యలను పాల కులకు ఎప్పటికప్పుడు విన్నవిస్తున్నా, కనీసం చర్చలు కూడా జరపడం లేదనే ఆవేదన డీలర్లను వేధిస్తోంది. ప్రజాపాలనలో తమ కష్టాలు తీరుతాయనే నమ్మకం డీలర్లలో సన్నగిల్లుతోంది.
గౌరవ వేతనం కోసం ఆందోళన....
రేషన్ డీలర్ల ముందు ఉన్న ప్రధాన సమస్య గౌరవ వేతనం. నెలకు రూ. 30 వేల గౌరవ వేతనాన్ని ఇవ్వా లని డీల్లరు దశాబ్దకాలానికి పైగా పోరాడుతున్నారు. కే రళ, తమిళనాడు రాష్ట్రాల్లో గౌరవ వేతనం కల్పిస్తు న్నందున తెలంగాణలోనూ గౌరవ వేతనం ఇవ్వాలని పట్టు బడుతున్నారు. ఈ డిమాండ్పై గత ప్రభుత్వం డీలర్లకు న్యాయం చేస్తామని ప్రకటించింది. కానీ పదే ళ్లలో ఈ అంశం పై బీఆర్ఎస్ ప్రభుత్వం పెదవి వి ప్పలేదు. ఇదిలా ఉండగా 2023లో జరిగిన ఎన్నికల స మయంలో కాంగ్రెస్ డీలర్లకు గౌరవ వేతనం హామీ ఇచ్చినట్లు డీలర్లు చెబుతున్నారు. రూ. 5 వేల గౌరవ వేతనం కల్పిస్తామనే హమీని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందు పరిచినట్లు అంటున్నారు. అయితే సం వత్సరం గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెం టనే స్పందించి గౌరవ వేతనం ఇవ్వాలని విన్నవిస్తు న్నారు. ఈ విషయమై రెండు నెలల క్రితం హైదరా బాద్లో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.
సకాలంలో అందని కమీషన్లు....
రేషన్ డీలర్లకు కమీషన్ డబ్బులు కూడా ప్రతినెల క్రమంగా అందడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా ఐదు నెలలకు సంబంధించిన కమీషన్లు ఇంకా జమ కాలేదని డీలర్లు వాపోతున్నారు. జిల్లాలో 423 మంది రేషన్ డీలర్లు ఉండగా, ఐదు నెలలకు ఒక్కొ క్కరికి దాదాపు రూ. లక్ష వరకు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. నెలవారిగా డబ్బులు అందకపోవడంతో డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య మం త్రిగా ఉన్న సమయంలో ’అమ్మ హస్తం’ పథకం అమ లు చేశారు. బియ్యంతో పాటు చక్కెర, పప్పులు, నూనె ఇతర సరుకులు మొత్తంగా 9 నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేవారు. ఇది డీలర్లకు కాస్త లాభ సాటిగానే ఉండేది. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రేష న్ షాపులు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. దీంతో కమీషన్లు గణనీయంగా తగ్గాయి. ఖర్చులు పెర గడం, కమీషన్లు తగ్గడంతో ఇబ్బందుల పాలవుతున్నా రు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున అమ్మ హస్తం మాదిరిగా నిత్యావసరాల సరుకుల విక్రయంపై చర్యలు తీసుకోవాలని డీలర్లు వేడుకుంటున్నారు.
మిగిలేది రిక్త హస్తాలే...
ఖర్చులన్నీ పోనూ చివరకు మిగిలేది రిక్తహస్తాలే అని డీలర్లు ఆవేదన చెందుతున్నారు. దిగుమతి చా ర్జీలు సైతం తామే భరించడం వల్ల ఏమీ మిగలడం లేదంటున్నారు. ఒక్కోసారి తామే అదనంగా భరించా ల్సిన దుస్థితి ఏర్పడుతుందనేది డీలర్ల వాదన. ఒక డీల ర్ వంద క్వింటాళ్ల బియ్యం బస్తాలను దిగుమతి చేసు కుంటే రవాణా, డైవ్రర్, కూలీ మొత్తంగా రూ.2 వేల వరకు భరించాల్సి వస్తోందని చెబుతున్నారు. వంద క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయిస్తే క్వింటాలుకు రూ.140 చొప్పున మొత్తంగా రూ.14 వేలు కమీషన్ రూపంలో డీలర్కు లభిస్తుంది. ఈ ఆదాయంలో షాపు అద్దె, వి ద్యుత్ చార్జీలు, హమాలీ కూలీలు, ఇతరత్రా ఖర్చుల చె ల్లింపులు జరిగితే ఏమీ మిగలడం లేదని చెబుతున్నా రు. ఈ క్రమంలో దిగుమతి చార్జీలు మరో భారంగా మారాయంటున్నారు. దీనిని ప్రభుత్వం గుర్తించి దిగు మతి చార్జీలను భరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీ ని ద్వారా డీలర్కు నెలకు రూ.2 వేలు మిగిలే అవకా శం ఉంటుందంటున్నారు. ఇక ఎంఎల్ఎస్ పాయింట్ల లో కాంటా సరిగ్గా ఉండక తూకంలో తక్కువ బియ్యం వస్తున్నాయని, బస్తాకు రెండు కిలోల బియ్యం తక్కు వగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ భారాన్ని కూడా తామే మోయాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు. క్వింటాల్ బియ్యం బస్తా కచ్చితమైన తూకంతో డీలర్లకు సరఫరా చేయాలని, షాపు రెన్యూ వల్ శాశ్వత ప్రాతిపదికన జరగాలని, ప్రతి నెల 1వ తేదీలోగా బియ్యం సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మానవతా దృక్పథంతో స్పందించాలి..
మోటపలుకుల సత్తయ్య, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు
నెలవారీ కమీషన్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గౌరవ వేతనం రూ.5 వేలు వెంటనే కల్పిం చాలి. డీలర్లకు ప్రస్తుతం ఉన్న కమీషన్ రూ. 140 నుం చి రూ. 300కు పెంచుతామన్నారు. ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. డీలర్ చనిపోతే అతని స్థానంలో వారసులకు అవకాశం కల్పిస్తామన్నారు. కరెంట్ బిల్లు, గది కిరాయలు చెల్లిస్తా మన్నారు. అనుకున్న ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర భుత్వం ఏర్పాటైనందున డీలర్ల సమస్యలపై ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్త మ్కుమార్ రెడ్డిలు మానవతా దృక్పథంతో స్పందించి, సమస్యలు పరిష్కరించాలి.