దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
ABN , Publish Date - May 08 , 2025 | 11:58 PM
దేశ వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశ్ పిలుపునిచ్చారు.
ఆలేరు, మే 8(ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశ్ పిలుపునిచ్చారు. ఆలేరులోని హమాలీ కార్మిక సంఘం అడ్డా వద్ద దేశ వ్యాప్త సమ్మె పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పని చేస్తున్న హమాలీ కార్మికులకు, ట్రాన్స్ఫోర్ట్ లాంటి రంగాల కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం రమేశ్, సంగి రాజు, హమాలీ కార్మికులు అయిలయ్య, ప్రభాకర్, సుదాకర్, బండి సిద్దులు, రాములు, నాగరాజు, నర్సింహులు, కిష్టయ్య, సురేశ్, సతీష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.