మహిళా సంఘాల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Apr 20 , 2025 | 10:54 PM
రాష్ట్ర ప్ర భుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల నిర్వహ ణలో మహిళా సంఘాలు ఆర్థిక సాధికారతే సాధిం చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ అధిక ప్రాధాన్యం ఇస్తుం దని మంచిర్యాల శాసన సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు అన్నారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు.
దండేపల్లి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్ర భుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల నిర్వహ ణలో మహిళా సంఘాలు ఆర్థిక సాధికారతే సాధిం చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ అధిక ప్రాధాన్యం ఇస్తుం దని మంచిర్యాల శాసన సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు అన్నారు. దండేపల్లిలో ఆదివారం జిల్లా గ్రామీణాభివృద్ది, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చే సిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఆర్ధిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కో ట్నాక తిరుపతి, డీఆర్డీవో కిషన్, మహిళా సంఘాల తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర భుత్వ హయాంలో మహిళలను కోటేశ్వరులుగా చే యడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. రైతు సంక్షేమం కో సం కాంగ్రెస్ ప్రభుత్వం ఆహర్నిషలు కృషి చేస్తోం దన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొ నుగోలు కేంద్రాల్లోనే పంటలను అమ్ముకుని క్వింటా ళ్లకు రూ. 2225 ప్రభుత్వ మద్దతు ధర పొందాల న్నారు. కార్యక్రమంలో ఆఫ్రో చైర్మన్ సింగతి మురళీ, లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్చందు, వైస్ చైర్మన్ ఆరీప్, డీపీఎం వేణు, రమేష్, ఆర్జీపీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, పార్టీ మం డల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ చైర్మన్ తిరుపతి పాల్గొన్నారు.