ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలి
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:12 PM
ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాల ని అధికారులకు అచ్చంపేట ఆర్డీవో మాధవి సూచించారు.
- అధికారుల శిక్షణలో అచ్చంపేట ఆర్డీవో మాధవి
ఉప్పునుంతల, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాల ని అధికారులకు అచ్చంపేట ఆర్డీవో మాధవి సూచించారు. బుధవారం మండల పరిషత్ కా ర్యాలయంలో మండల ప్రతేక్య అధికారి నాగేం దర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆ ర్డీవో మాధవి మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీ సీ, సర్పంచ్ల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కో డ్ అమల్లోఉందని, అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ను ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పువని హెచ్చరించారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, మండలంలోని వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీ వో మోహన్లాల్, డీటీ పరశునాయక్, ఎంపీవో వెంకటేష్, ఎంఈవో చంద్రశేఖర్ ఉన్నారు.
పకడ్బందీగా నిర్వహించాలి
కల్వకుర్తి : ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎ న్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కల్వకుర్తి ఎంపీడీవో ఎన్.వెంకట్రాములు, తహసీల్దార్ ఇ బ్రహీంలు కోరారు. కల్వకుర్తి పట్టణంలోని ఎంపీ డీవో కార్యాలయం సమావేశ మందిరంలో బుధ వారం స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కా ర్యక్రమం నిర్వహించారు. పోలింగ్ స్టేషన్లలో తీసు కోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సమావే శంలో ఎంఈవో శంకర్ నాయక్, ఏవో సురేష్, పీవోలు పాల్గొన్నారు.