నెరవేరనున్న నిరుపేదల సొంతింటి కల
ABN , Publish Date - Jun 02 , 2025 | 11:26 PM
నిరుపేదలైన ల బ్ధిదారులకు సొంతింటి కళ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ప్ర భుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సా గర్రావు అన్నారు. నస్పూర్ పట్టణంలో సోమవారం ఏ ర్పాటు చేసిన సమావేశంలో మంచిర్యాల కార్పొరేషన్ ప రిధిలోని మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్లో అర్హులై న పేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను ఎ మ్మెల్యే ప్రేంసాగర్రావు పంపిణీ చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల అనుమతి పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నస్పూర్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి) : నిరుపేదలైన ల బ్ధిదారులకు సొంతింటి కళ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ప్ర భుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సా గర్రావు అన్నారు. నస్పూర్ పట్టణంలో సోమవారం ఏ ర్పాటు చేసిన సమావేశంలో మంచిర్యాల కార్పొరేషన్ ప రిధిలోని మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్లో అర్హులై న పేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను ఎ మ్మెల్యే ప్రేంసాగర్రావు పంపిణీ చేశారు. మంచిర్యాల- 509, నస్పూర్-529 మంది, హాజీపూర్-162 మంది ల బ్ధిదాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అం దించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రా వు మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం తాము కట్టు బడి ఉన్నామని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందిం చే విధంగా మాటలు నిలబెట్టుకుంటామన్నారు. మంచి ర్యాలలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠ శాలలను నిర్మిస్తున్నమన్నారు. రాష్ట్రంలోనే తొలిసా రిగా అండర్ గ్రౌండ్ కేబుల్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంచిర్యాలలోనే ఫైలేట్ ప్రాజెక్టు ద్వారా మొద లైందన్నారు. నస్పూర్లో 15 పడకల తో ఈస్ఐ హాస్పి టల్ అందుబాటులోకి రానుందన్నారు. మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ అసుపత్రిని తొలిసారిగా జిల్లాలోనే చేస్తున్నట్లు తెలిపారు. అర్షులైన వారిందరికి రేషన్ కా ర్డులు అందిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తు లను దోచుకున్న వారిని నుంచి తిరిగి ప్రజలకు చేందే విధం గా లెక్కను సరిచేస్తానని, ప్రజలకు అన్యాయం చేసిన ఏవర్ని వదిలి పెట్టేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమీషనర్ శివాజీ, న స్పూర్, మంచిర్యాల, హాజీపూర్ తహసిల్దార్లు సంతోష్ కుమార్, రఫతుల్లా, శ్రీనివాస్ దేశ్పాండే కాంగ్రెస్ నా యకులు సుర్మిళ వేణు, పూదరి తిరుపతి, కలీద్, తూ ముల నరేష్, సంజీవ్, డేగ బాపు, ఒడ్డె రాజమౌళి, రజిత పాల్గొన్నారు.