ప్రధాని మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:24 PM
ప్రధాని మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెం దుతుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ పేర్కొన్నారు. శనివారం చెన్నూరు పట్ట ణంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ 11 సంవత్సరాల సుపరిపా లన, పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ కార్యాలయంలో మొక్కలు నాటారు.
చెన్నూరు, జూన్ 7 (ఆంధ్రజ్యోతి) : ప్రధాని మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెం దుతుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ పేర్కొన్నారు. శనివారం చెన్నూరు పట్ట ణంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ 11 సంవత్సరాల సుపరిపా లన, పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సం దర్భంగా దుర్గం అశోక్ మాట్లాడుతూ ప్రధాని మోదీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, అ నేక పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. అలాగే చెన్నూరు పట్టణంలో స్ధానిక సమస్యలపై పో రాటాలు చేస్తామని తెలిపారు. అనంతరం చెన్నూరు పట్టణ నూతన కమిటీని ఎన్నుకున్నారు. పట్ట ణ ఉపాధ్యక్షురాలుగా జాడి సురేఖ, సత్యనారాయణ, శాంతకుమారి, పట్టణ ప్రధాన కార్యదర్శిగా కా యిత రాజేశ్వర్, కార్యదర్శులుగా రేణుకాదేవి, సుధీర్, వెంకటేష్, నరేష్, కోశాధికారిగా మధుకర్లను ఎన్నుకున్నారు. నియామకమైన వారికి నిమాయక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నా యకులు వెంకటనర్సయ్య, శ్రీనివాస్, శివకృష్ణ, మాణిక్, శంకర్, దుర్గ ప్రసాద్, రాజబాపు, శ్రీకాంత్, శ్రావణి, సతీష్, వినోద్కుమార్, మహేష్, రమేష్, అభిలాష్ పాల్గొన్నారు.