Deputy CM Mallu Bhatti Vikramarka: రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కండి
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:09 AM
రాష్ట్ర అభివృద్ధిలో కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు భాగస్వాములు కావాల ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రజా భవన్లో...
పెట్టుబడులకు కేంద్రంగా ఫ్యూచర్ సిటీ: భట్టివిక్రమార్క
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధిలో కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు భాగస్వాములు కావాల ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రజా భవన్లో శుక్రవారం కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మీ అందరి సహకారంతో ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యం సాధించాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆర్థిక పరిపుష్ఠి, సానుకూల వాతావరణం, నిపుణులైన మానవ వనరులతో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామమన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో తమ సర్కారు పని చేస్తోందని చెప్పారు. డెల్లాయిట్, ఈవై, కేపీఎంజీ, బీసీజీ, పీడబ్ల్యూసీ, జెఎల్ఎల్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలోని అత్యుత్తమ పోలీసు వ్యవస్థల్లో తెలంగాణ పోలీసు ఒకటని, శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉంటాయని ఆయన తెలిపారు.