Share News

Telangana Public Service Commission: ఒకట్రెండు రోజుల్లో గ్రూప్‌ 2 తుది జాబితా!

ABN , Publish Date - Sep 28 , 2025 | 02:39 AM

రాష్ట్రంలో గ్రూప్‌ 2 సర్వీసు పోస్టుల తుది జాబితా విడుదలకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సిద్ధమైంది. సాధ్యమైనంత త్వరగా ఫలితాలు వెల్లడించాలని..

Telangana Public Service Commission: ఒకట్రెండు రోజుల్లో గ్రూప్‌ 2 తుది జాబితా!

  • ఏర్పాట్లు పూర్తిచేసిన టీజీపీఎస్సీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రూప్‌-2 సర్వీసు పోస్టుల తుది జాబితా విడుదలకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సిద్ధమైంది. సాధ్యమైనంత త్వరగా ఫలితాలు వెల్లడించాలని కసరత్తు చేస్తోంది. గ్రూప్‌-2లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. అభ్యర్థుల విద్యార్హతలు, రిజర్వేషన్లు, మెరిట్‌, తదితర విషయాలు పరిగణన లోకి తీసుకుని ఒకట్రెండు రోజుల్లో తుది జాబితా ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఐసీడీఎస్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్ల పోస్టుల తుది జాబితాను కమిషన్‌ శనివారం విడుదల చేసింది. మొత్తం 181 పోస్టుల్లో 176 పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల తుది జాబితా వెబ్‌సైట్లో ఉంచామని టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం తెలిపారు.

Updated Date - Sep 28 , 2025 | 02:39 AM