Share News

Telangana Panchayat Elections 2025: ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది..

ABN , Publish Date - Nov 25 , 2025 | 06:40 PM

స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని మంగళవారం సాయంత్రం పంచాయితీ ఎన్నికలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 31 జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.

Telangana Panchayat Elections 2025: ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది..
Telangana Panchayat Elections 2025

తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల అయింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని మంగళవారం సాయంత్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కోటి 66 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. సెప్టెంబర్ 29వ తేదీన అనౌన్స్ చేసిన షెడ్యూల్‌ను కొన్ని కారణాల వల్ల నిలిపివేశాము. ఈ రోజు నుంచి ఎంసీసీ కోడ్ అమలులోకి వస్తుంది.


అబ్జర్వల్‌లు, ఎలక్షన్ అబ్జర్వల్‌లను నియమించాం. 31 జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 11,14,17 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు పోలింగ్ రోజే ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. నవంబర్ 27వ తేదీ నుంచి తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30వ తేదీ నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి

ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!

లిక్కర్ స్కామ్‌లో.. జోగి రమేష్‌కు పోలీస్ కస్టడీ..

Updated Date - Nov 27 , 2025 | 07:52 AM