Share News

విజయవంతంగా ఉద్యాన పంటల సాగు

ABN , Publish Date - Aug 09 , 2025 | 11:48 PM

అచ్చంపేట నియోజకవర్గంలో పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ద్వారా చేప ట్టిన ఉద్యాన పంటల సాగు రాష్ట్ర ప్ర భుత్వ ఆలోచనకనుగుణంగానే జి ల్లాలో విజయవంతంగా కొనసాగుతు న్నదని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నా రు.

విజయవంతంగా ఉద్యాన పంటల సాగు
సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, ఆగస్టు9 (ఆంధ్రజ్యో తి) : అచ్చంపేట నియోజకవర్గంలో పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ద్వారా చేప ట్టిన ఉద్యాన పంటల సాగు రాష్ట్ర ప్ర భుత్వ ఆలోచనకనుగుణంగానే జి ల్లాలో విజయవంతంగా కొనసాగుతు న్నదని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నా రు. శనివారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర మైనా ర్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, ప్రధా న కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, రెడ్‌కో సీఎండీ, ఎస్‌ పీడీసీఎల్‌ సీఎండీ, సింగరేణి కాలరీస్‌ సీఎండీ లతో కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతా ధికారులతో సోలార్‌ సిస్టమ్‌ ఇన్స్టాలేషన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ తన చాంబర్‌ నుంచి పాల్గొని మాట్లాడుతూ ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా రానున్న రెండు సంవత్సరాల్లో ఆర్థిక వనరులు పెంపొం దించుకుని చెంచులు, గిరిజనుల జీవనోపాధు లు మెరుగుపడనున్నాయని, జిల్లా యంత్రాం గం గిరిజనుల సాగుపై ప్రత్యేక దృష్టి సారించిం దని కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వ ఆదేశానుసా రం జిల్లాలో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అనువై న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళా శాలలు, ఖాళీ ప్రభుత్వ స్థలాల వివరాలను నిర్ణీత నమూనాలో అందించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 11:48 PM