విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:18 PM
ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదువాలని క లెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మం గళవారం మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలతో పాటు క వ్వాల్ గ్రామంలోని గిరిజన ఆశ్రమ బా లికల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ లు నిర్వహించారు. ఈసందర్భంగా వి ద్యార్థుల వద్దకు వెళ్లి విద్యార్థులతో మా ట్లాడారు.
పాఠశాలలో హాజరుశాతం పెంచాలి
కలెక్టర్ కుమార్ దీపక్
జన్నారం,ఆగస్టు12(ఆంధ్రజ్యోతి): ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదువాలని క లెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మం గళవారం మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలతో పాటు క వ్వాల్ గ్రామంలోని గిరిజన ఆశ్రమ బా లికల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ లు నిర్వహించారు. ఈసందర్భంగా వి ద్యార్థుల వద్దకు వెళ్లి విద్యార్థులతో మా ట్లాడారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. ప్రతి వి ద్యార్థి కష్టపడి చదువాలని ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ సదుపాయాలు కల్పిస్తుంద న్నారు. విద్యార్థులను ఒక్కొక్కరిగా ప్ర శ్నలు అడిగారు. పుస్తకాల్లో ఉన్న పా ఠ్యాంశాలపై పూర్తి స్థాయిలో అవగాహ న ఉండాలని పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న మెను ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలన్నా రు. బాలికల పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నా రు. ఆయన వెంట తహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డితో పాటు ఆయా పాఠశా లల ఉపాద్యాయులు పాల్గొన్నారు.