Share News

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి

ABN , Publish Date - Jul 01 , 2025 | 11:08 PM

విద్యార్థులు క్ర మ శిక్షణతో చదువుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సం స్థ సెక్రటరీ నసీమా సుల్తానా అన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి
విద్యార్థులకు జామెట్రీ బాక్సులను పంపిణీ చేస్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నసీమా సుల్తానా

- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నసీమా సుల్తానా

కందనూలు, జూలై 1 (ఆంరఽధజ్యోతి) : విద్యార్థులు క్ర మ శిక్షణతో చదువుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సం స్థ సెక్రటరీ నసీమా సుల్తానా అన్నారు. జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ నాగర్‌కర్నూల్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నాగర్‌కర్నూల్‌వారి ఆధ్వర్యంలో మం గళవారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జామెట్రీ బాక్సులను పంపిణీ చే శారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశా లల్లో చదివే పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్‌లు, వసతులు, చక్కటి వాతావర ణం, స్కూల్‌ గ్రౌండ్‌ సౌకర్యం న్నాయన్నారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ ఎస్‌బీఐ మేనేజర్‌ రాకేశ్‌శర్మ, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కే.రవికాంతారావు, డిప్యూటీ చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ శ్రీరామ్‌ ఆర్య, హెచ్‌ఎం శోభన్‌ బాబు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 11:08 PM