విద్యార్థులు పట్టుదలతో చదవాలి
ABN , Publish Date - Jul 04 , 2025 | 11:34 PM
ప్రతీ ఒక్క విద్యార్థి పట్టుదల క్రమశిక్షణతో చదువుకోవాలని కలె క్టర్ కుమార్ దీపక్ విద్యార్థులను సూచించారు. శుక్ర వారం లక్షెట్టిపేట పట్టణంలో నూతనంగా నిర్మించి న ప్రభుత్వ కళాశాల పాఠశాలను కలెక్టర్ పరిశీ లించారు. పాఠశాలలో మౌలిక వసతులపై విద్యా ర్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
లక్షెట్టిపేట, జులై 4(ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్క విద్యార్థి పట్టుదల క్రమశిక్షణతో చదువుకోవాలని కలె క్టర్ కుమార్ దీపక్ విద్యార్థులను సూచించారు. శుక్ర వారం లక్షెట్టిపేట పట్టణంలో నూతనంగా నిర్మించి న ప్రభుత్వ కళాశాల పాఠశాలను కలెక్టర్ పరిశీ లించారు. పాఠశాలలో మౌలిక వసతులపై విద్యా ర్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్య వై ద్యంపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగు తుం దని ఎంతో ఖర్చు చేసి విద్యార్థులకు మంచి విద్యను అందించడం కోసం అన్ని హంగులతో భవనం నిర్మించిందన్నారు. ప్రతీ విద్యార్థి ఒక లక్ష్యం ఎంచు కుని ఆలక్ష్య సాధన కోసం చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, కళా శాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. అనంతరం కస్బూర్భా గాంధీ పాఠశాలను సందర్శించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. ఈకార్యక్రమం లో కలెక్టర్ వెంట తహసీల్దార్ దిలీప్ కుమార్, ప్రిన్సిపల్ లక్ష్మన్రావు, హెచ్ఎం వేణుగోపాల్తో పా టు అధ్యాపకులు ఉపాధ్యాయులు ఉన్నారు.
వసతి గృహాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలి