Share News

శివకేశవులకు విశేష పూజలు

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:20 AM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కొండపై సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి.

శివకేశవులకు విశేష పూజలు
శివాలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కొండపై సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. స్వయంభు స్వామిఅమ్మవారికి వైష్ణవ పాంచరాత్రాగమ రీతిలో, పర్వతవర్థిని రామలింగేశ్వరస్వామి శివాలయంలో స్ఫటిక మూర్తులకు శైవాగమశాస్త్రరీతిలో నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ప్రధానాలయంలో సుప్రభాత సేవతో స్వామిఅమ్మవారిని మేల్కొ లిపిన అర్చకులు మూలమూర్తులను వేదమంత్ర పఠనాలు, పంచా మృతాలతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చించారు. అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించిన పూజారులు విశ్వక్సేనుడికి తొలి పూజలు చేపట్టి సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం అలంకార వెండి జోడు సేవలు, సహాస్రనామార్చనలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. శివాలయంలోని ముఖమండపంలో స్పటిక మూర్తులను అర్చకులు వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల మధ్య పంచామృతాలతో అభిషేకించారు. శివపార్వతుల ఉత్సమూర్తులకు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. ఖజానాకు వివిధ విభాగాల ద్వారా ఆలయ రూ.42,62,938 ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్‌. వెంకట్రావు తెలిపారు. కాగా, ఈ నెల 27న ఈప్రోక్యూర్‌మెంట్‌ సీల్డ్‌ టెండర్‌ నిర్వహించనున్నట్లు ఈవో వెంకట్రావు సోమవారం ప్రకటించారు. లీజెస్‌ విభాగంలో 22, ఒకటి మినీవాల్యూ విభాగం, సివిల్‌ విభాగం ఆరు టెండర్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వైభవంగా మట్టపల్లి లక్ష్మీనరసింహుడి కల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహుడి నిత్యకల్యాణాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. భక్తవత్సలుడికి నిజాభిషేకం, నిత్యార్చనలు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆర్జిత కైంకర్యాలు జరిగాయి. ఉదయం హోమాధికాలు నిర్వహించారు. తదుపరి కల్యాణ మూర్తులను పరిణయోత్సవ వేదికపైకి వేంచేయించి పుణ్యాహవాచనం గావించారు. పాదప్రక్షాళనం మధుపర్క పూజలు యాధావిధిగా చేపట్టారు. మాంగళ్యధారణ, యజ్ఘోపవీత ధారణల అనంతరం దివ్యమూర్తులకు గరుడోత్సవం జరిగింది. మధ్యాహ్నం అమ్మవారికి కుంకుమార్చన, విశేషపర్వాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 12:20 AM