Share News

సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగాలి

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:33 PM

సామాజిక సేవే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు ముందుకు సాగాలని వాసవీక్లబ్‌ ఇంటర్నేష నల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జూ లూరి రమేష్‌బాబు పిలుపునిచ్చారు.

సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగాలి
మెమెంటోలను అందజేస్తున్న జూలూరి రమేష్‌బాబు

- వాసవీక్లబ్‌ ఇంటర్నేషనల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జూలూరి రమేష్‌బాబు

కల్వకుర్తి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : సామాజిక సేవే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు ముందుకు సాగాలని వాసవీక్లబ్‌ ఇంటర్నేష నల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జూ లూరి రమేష్‌బాబు పిలుపునిచ్చారు. ఆదివారం వనస్థలిపురం వాసవీ కన్యకా పర మేశ్వరి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన డిస్ర్టిక్ట్‌ వి102 ఏ రీజియన్‌ 2శ్రీశైల భ్రమరాంబిక సేవ పురస్కార వైభవం సదస్సుకు రమేష్‌బా బు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవలతోనే సార్థకత లభిస్తుందని చెప్పారు. అనంతరం ఉ త్తమ క్లబ్‌కు మెమోంటోలను ఆయన అందజే శారు. కార్యక్రమంలో వాసవిక్లబ్‌ ఈసీ ఆఫీసర్‌ విఠదురయ్య, వి 108 ఎలెక్ట్‌ గవర్నర్‌ కలిమిచెర్ల రమేష్‌, 102ఏ గవర్నర్‌ అల్లాడి పరమేశ్‌, అబ్జర్వర్‌ నవీన్‌, కొత్త మాసు రమేష్‌, ఉప్పల శ్రీనివాస్‌, రీజియన్‌ చైర్మన్‌ మద్ది శివ, నాగేశ్వర్‌ రావు, రీజియన్‌ పరిధిలోని వాసవిక్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2025 | 11:33 PM