Minister Danasari Anasuya: మహిళా శక్తి బజార్లో సరస్-2025 మేళా
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:13 AM
హైదరాబాద్, హైటెక్సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో ఏర్పాటు చేసిన సరస్ సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్స్ సొసైటీ...
హైటెక్ సిటీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, హైటెక్సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో ఏర్పాటు చేసిన సరస్ (సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్స్ సొసైటీ) ఫెయిర్-2025ను రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) శుక్రవారం ప్రారంభించారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు, చేతి వృత్తుల వారు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఉంటాయి. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ (సెర్ప్) ఆధ్వర్యంలో ఈనెల 29 వరకు ప్రదర్శన ఉంటుంది.