Share News

యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా నిత్యపూజలు

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:34 AM

యాదగిరిగుట్ట లక్ష్మీన రసింహస్వామి దివ్యక్షేత్రంలో నిత్య పూజలు బుధవారం వైభవంగా నిర్వహించారు.

యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా నిత్యపూజలు
నిత్య కల్యాణోత్సవ పర్వాలు నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, జూలై 16(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీన రసింహస్వామి దివ్యక్షేత్రంలో నిత్య పూజలు బుధవారం వైభవంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిఅమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు గర్భగుడిలో కొలువుదీరిన స్వయం భువు లను, సువర్ణ ప్రతిష్టామూర్తులను అభిషేకరించారు. ప్రధానా లయం అష్టభుజి ప్రాకార మండపంలో అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన శతక పఠనాలతో హవనం నిర్వహిం చారు. సాయంత్రం ముఖమండపంలో దర్బారు సేవోత్సవం చేప ట్టిన ఆచార్యులు అంకార వెండి జోడు సేవలు నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో నిత్య పూజలు కొనసా గాయి. కొండపైన శివాలయంలో పర్వతవర్థిని రామలింగేశ్వర స్వామికి రుద్రహవనం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.16,93,082 ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్‌. వెంకట్రావు తెలిపారు.

ఆకట్టుకున్న కళాకారుల నృత్య ప్రదర్శన

ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు ఆలయంలో ధార్మిక, సాహిత్య, సంగీత సభలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఖతర్‌ దేశం నుంచి ఆంధ్ర కళావేదిక ద్వారా వీ2 డాన్స్‌ అకాడమీ శ్రీ వెంకటప్రభు శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. హైదరాబాద్‌లో ఉండే వీరు ఖతర్‌ దేశంలో అకాడమీ ద్వారా ప్రదర్శనలు ఇస్తున్నట్లు తెలిసింది. గత ఏడాది అకాడమీ నుంచి ప్రదర్శన ఇచ్చేందుకు దేవస్థానాన్ని సంప్రదించగా వర్షాలు కురవడంతో అవకాశం లభించలేదు. కాగా, ఖతర్‌ దేశంలో వేసవి సెలవులు ఉన్నందున భారత దేశంలో ప్రముఖ దేవాలయాల్లో నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు ఇక్కడకు వచ్చారు. యాదగిరిగుట్ట ఆలయంలో కూచిపూడి నృత్యం ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో రాజలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణాన్ని వేదపండితులు సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాభిషేకం, నిత్యార్చనలు చేశారు. ఆలయ సంప్రదాయ ప్రకారం ఆర్జిత కైంకర్యాలు జరిగాయి. అనంతరం మాంగల్యధారణ, యజ్ఘోపవీత ధారణల అనంతరం దివ్యమూర్తులకు గరుడోత్సవం జరిగింది. మధ్యాహ్నం అమ్మవారికి కుంకుమార్చన, విశేషపర్వాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 12:34 AM