Share News

శాస్త్రోక్తంగా నిత్యపూజలు

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:37 AM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు.

శాస్త్రోక్తంగా నిత్యపూజలు
తిరువీధి సేవ నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిఅమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు గర్భగుడిలో కొలువుదీరిన స్వయం భువులను, సువర్ణ ప్రతిష్టామూర్తులను అభిషేకరించి తులసీదళాలతో సహస్ర నార్చనలు నిర్వహించారు. ప్రధానాలయం అష్టభుజి ప్రాకార మండపంలో స్వామి అమ్మవారిని అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన శతక పఠనాలతో హవనం నిర్వహించారు. అనంతరం గజవాహన సేవలో ఊరేగించి విశ్వేక్సేనుడి తొలి పూజలతో నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. సాయంత్రం ముఖమండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు అంకార వెండి జోడు సేవలు, సహస్త్రనార్చనలు జరిపారు. పాతగుట్ట ఆలయంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ నిత్య పూజలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామికి రుద్రహవనం శైవాగమ పద్దతిలో నిర్వహిం చారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.13,37,470ల ఆదాయం సమకూరినట్లు ఈవో ఏ. భాస్కర్‌రావు తెలిపారు.

Updated Date - Apr 10 , 2025 | 12:37 AM