భక్తజన సంద్రంగా రాజన్న క్షేత్రం
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:20 AM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తారనే ప్రచారం జోరుగా సాగడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం ఆలయ కల్యాణకట్టలో
వేములవాడ కల్చరల్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తారనే ప్రచారం జోరుగా సాగడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించారు. రాజన్నకు ఎతో ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. క్యూలైన్లో భక్తులు సుమారుగా 5 గంటలు నిరీక్షించి రాజన్న కోడె మొక్కు చెల్లించుకుని శ్రీస్వామి వారి దర్శనం చేసుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో రాజన్న ఆలయ ఈవో క్షేత్రస్థాయిలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ ఆలయంలోనే సాయంత్రం వరకు ఉన్నారు.
భక్తుతో సందడిగా మారిన భీమన్న ఆలయం
వేములవాడ శ్రీభీమేశ్వర ఆలయంలో పనులు పూర్తి కావడంతో భక్తులతో సందడిగా కనిపిం చింది. రాజన్న ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులు భీమన్నను దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నారు. సోమవారం కావడంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.