ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:24 PM
ప్రజావాణి అందిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సో మవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
కలెక్టరేట్, మార్చి24 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి అందిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సో మవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. మంద మర్రి మండలం ఊరు రామకృష్ణాపూర్కు చెందిన మెంగని శ్రీనివాస్ మందమర్రి శివారులోని తన భూమిని తెలియకుండా అక్రమంగ పట్టా చేసుకు న్నారని, ఈ విషయంపై న్యాయస్థానంలో కేసు కొన సాగుతున్నందున ఈ భూమి ఎలాంటి లావాదే వీ లు, పట్టా మార్పులు జరుకుగండా చర్యలు తీసు కో వాలని కోరారు. తెలంగాణ దివ్యాంగుల ఐక్యవేదిక ప్రతినిధి నగురారపు సుమన్ దరఖాస్తులో ప్రభు త్వం తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్లను ప్రతి దివ్యాం గుడికి కేటాయించాలని, 40శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు అంత్యోదయ ురేషన్కార్డు జారీ చేయా లని, రాజీవ్ యువ వికాసం పథకంలో దివ్యాంగులు దరఖాస్తు చేసుకునేలా అవకాశాం కల్పించాలని, ఇ చ్చిన హామీ మేరకు పెంఛన్ పెంచాలని, సదరం శిబిరాలలో స్లాట్లను 100కు పెంచాలని కోరారు. క లెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అం దిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరి ష్కరించే దిశగాచర్యలు తీసుకుంటామని తెలిపారు.
వడదెబ్బ నుంచి కాపాడుకోవాలి
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా గు రయ్యే వడదెబ్బ నుంచి ప్రతి ఒక్కరు కాపాడుకో వా లని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవా రం నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవ న సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా టా స్క్ఫోర్స్ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్రావు, జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. హరీశ్రాజ్ జి ల్లా సంక్షేమాధికారి రౌఫ్ఖాన్, జిల్లా పంచాయతీ అ ధికారి వెంకటేశ్వర్రావుతో కలిసి వడదెబ్బ నివారణ పై చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వడదె బ్బ నుంచి కాపాడుకునేందుకు పాటించాల్సిన జాగ్ర త్తలు, వడదెబ్బ నుంచి రక్షించుకునేందుకు తీసుకో వాల్సిన చర్యలపై ప్రజలు అవగాహన కల్పించారు. ఉప జిల్లా వైద్యాధికారులు ఉన్నారు.