Share News

నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:13 PM

ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలని పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌వు కాంట్రాక్టర్లను ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవన నిర్మా ణం పనులను, ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం పనులను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు.

నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి
అంబలి పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

లక్షెట్టిపేట, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలని పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌వు కాంట్రాక్టర్లను ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవన నిర్మా ణం పనులను, ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం పనులను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు విధ్య వైద్యం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందు కు సాగుతోందన్నారు. త్వరతగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్‌ పార్టీ పట్ట ణ అధ్యక్షుడు ఎండీ,ఆరీఫ్‌, మండల అధ్యక్షుడు పింగిళి రమేష్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ చెల్ల నాగభూషణం, జిల్లా ఉపాద్యక్షుడు చింత అశోక్‌కుమార్‌, యూత్‌ అద్యక్షు డు రాందేని చిన్న వెంకటేష్‌, మాజీ వైస్‌ ఎంపీపీ దేవేందర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌లు సురేష్‌నాయక్‌, వెంకటేష్‌, బ్లాక్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజు, పాల్గొన్నారు.

అంబలి కేంద్రం ఏర్పాటు..

పట్టణంలోని ఊత్కూర్‌ చౌరస్తాలో కొక్కిరాల రఘుపతిరావు చారిటేబుల్‌ ట్రస్ట్‌ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే సోమవారం నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం డీ,ఆరీఫ్‌, మండల అధ్యక్షుడు పింగిళి రమేష్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ చెల్ల నాగభూ షణం, జిల్లా ఉపాద్యక్షుడు చింత అశోక్‌కుమార్‌, యూత్‌ అద్యక్షుడు రాందేని చిన్న వెంకటేష్‌, మాజీ వైస్‌ ఎంపీపీ దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:13 PM