పుష్కర ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:23 PM
2027లో గోదావరి, 2028లో కృష్ణ పుష్కరాలను పుర స్కరించుకుని నది తీర ప్రాంతాల్లో భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్ధవంతంగా ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : 2027లో గోదావరి, 2028లో కృష్ణ పుష్కరాలను పుర స్కరించుకుని నది తీర ప్రాంతాల్లో భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్ధవంతంగా ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పుష్కరాల నిర్వ హణపై రాష్ట్ర దేవాదాయ శాఖ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ప్రతినిధులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఉ మ్మడి జిల్లా దేవాదాయ శాఖ అధికారి నవీన్కుమార్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావులతో కలిసి హాజర య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్క రాలను సురక్షితంగా, సవ్యంగా భక్తులకు అనుకూలంగా నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుందన్నారు. ఈ క్రమంలో పుష్కరాల ప్రణాళిక, సమన్వయం, అమలు బాధ్యతలను ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థకు అప్పగించినట్లు తెలిపారు. దే వాదాయ శాఖకు అవసరమైన సమగ్ర వివరాలను అం దిస్తామని, పుష్కరఘాట్లపై క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే నిర్వహించామన్నారు. జిల్లాలో మొత్తం 11 ప్రాంతాల్లో పుష్కరఘాట్లు ఉన్నాయని, భక్తుల సంద ర్శన సంఖ్య ఆధారంగా ఈ ఘాట్లను 3 టియర్స్గా విభజించామన్నారు. ఆయా ఘాట్ల అబివృద్ధి పనులు, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, ఆరోగ్యం, విద్యుత్ వంటి అంశాలపై సంబంధిత శాఖల అధికారులు స మన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.