జనజాగృతి గీతం-వందేమాతరం
ABN , Publish Date - Nov 07 , 2025 | 10:31 PM
భారత జాతి బానిసత్వ విముక్తి జన జాగృతి గీతం వందేమాతరం అని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
మంచిర్యాల క్రైం, నవంబరు 7(ఆంరఽధజ్యోతి) : భారత జాతి బానిసత్వ విముక్తి జన జాగృతి గీతం వందేమాతరం అని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. బంకించంద్ర చటర్జి రచించిన వందేభారత గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం వందేమాతర గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ భారత్ భారీ సామాజిక, సాంస్కృతిక రాజకీయ మార్పు లకు లోనవుతున్న కాలంలో జాతీయ గుర్తిం పు భావన, వలస పాలనపై ప్రతిఘటన పె రుగుతున్న ఆ కాలంలో వందే మాతరం, మా తృభూమని, బలం, దైవ జ్ఞానకి ప్రతీకగా మా ర్చిందన్నారు. భారతీయ సమైఖ్యత, ఆత్మ గౌ రవాన్ని పెంపొం దించిందన్నారు. జాతీయ గే యాన్ని గౌరవించేందుకు దేశ భక్తి కృతజ్ఞత కు సమిష్టి ప్రతీకగా ఈ కార్యక్రమాల్లో దేశ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అ న్నారు. ఈ కార్య క్రమంలో అడిషన్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐలు వామన మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.
రెవెన్యూ కార్యాలయంలో...
మంచిర్యాల రెవెన్యూ డివిజన్ అఽధికారి కా ర్యాలయంలో వందేమాతర గీతాన్ని ఆలపిం చారు. 150 వసంతాలు పూర్తి చేసుకున్న సం దర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీ వో రశ్రీనివాస్రావు, డీఏవో రమేష్, డీటీ శ్రీహ రి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.