Share News

మొక్కలకు క్రమం తప్పకుండా నీరందించాలి

ABN , Publish Date - May 02 , 2025 | 11:25 PM

నర్సరీల్లోని మొక్కలకు క్రమం తప్ప కుండా నీరందించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు పే ర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఇందారం, టేకుమట్ల, కిష్టాపూర్‌, వే లాల గ్రామపంచాయతీల్లో పర్యటించారు.

మొక్కలకు క్రమం తప్పకుండా నీరందించాలి

డీపీవో వెంకటేశ్వర్‌రావు

జైపూర్‌, మే 2 (ఆంధ్రజ్యోతి) : నర్సరీల్లోని మొక్కలకు క్రమం తప్ప కుండా నీరందించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు పే ర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఇందారం, టేకుమట్ల, కిష్టాపూర్‌, వే లాల గ్రామపంచాయతీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్లాస్టిక్‌, వ్యర్దాలను రోడ్లపై ఉంచకుండా శుభ్రం చేయాలన్నారు. డ్రైనేజీల్లో పూర్తిస్ధాయిలో మట్టి తీయా లన్నారు. రికార్డు లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని, తాగునీటి సమస్య లేకుం డా చర్యలు తీసుకోవాలన్నారు. నీటిలో బ్లీచింగ్‌ పౌడర్‌ కలపాలని, ఇబ్బం దులు లేకుండా నీటి సరఫరా చేయాలన్నారు. ఎండల తీవ్రత నుంచి నర్సరీల్లోని మొక్కలను రక్షించుకోవడానికి నెట్‌షెడ్‌లను సరి చేసుకోవాల న్నారు. గ్రామాల్లోని బస్టాండ్‌, కూడళ్ల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేసి రంజాన్‌లలో ఎప్పుడు నీరు ఉండేలా చూడాలన్నారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు, పంచాయతీ కార్యదర్శు లు సుమన్‌, శ్రావణి, ప్రశాంత్‌, రాకేష్‌ ఉన్నారు.

Updated Date - May 02 , 2025 | 11:25 PM