Share News

రహదారి ఆక్రమించి...

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:27 AM

చండూరులో ప్రణాళికా విభాగం అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొం దరు వ్యాపారులు యథేచ్ఛగా రహదారులను ఆక్రమించి దుకాణాలు ని ర్మిస్తున్నారు.

  రహదారి ఆక్రమించి...
జడ్పీ హైస్కూల్‌ పక్కన ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలు

రహదారి ఆక్రమించి...

చండూరు, ఆంధ్రజ్యోతి

చండూరులో ప్రణాళికా విభాగం అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొం దరు వ్యాపారులు యథేచ్ఛగా రహదారులను ఆక్రమించి దుకాణాలు ని ర్మిస్తున్నారు. గుండ్రాపల్లి ఎక్స్‌రోడ్డు, జడ్పీహైస్కూల్‌ ప్రహరీని ఆనుకుని ప్రధాన రహదారి వెంబడి కొందరు, హైదరాబాద్‌ రోడ్డులో, తెలంగాణ త ల్లి విగ్రహం పక్కన కొంతమంది వ్యాపారులు సిమెంట్‌ కట్టడాలు, రేకులతో షెడ్డులను వేసుకుని స్థలాలను ఆక్రమించుకున్నా మునిసిపల్‌ అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. వారికి కొందరు మాజీ ప్రజాప్రతినిధులు అండగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వాహనాలకు అసౌకర్యంగా మారుతుంది. ఈ విషయంపై కమిషనర్‌ పుష్పలతను వివరణ కోరగా తాము నిర్మాణాలకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ప్రణాళిక సిబ్బందిని పంపి పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:27 AM