శాపల్లిలో నేడు నృసింహ జయంతి వేడుకలు
ABN , Publish Date - May 09 , 2025 | 11:55 PM
నృసింహ జయం తి వేడుకలకు నార్కట్పల్లి మండలం శాపల్లిలో గల ప్రసిద్ధ వైష్ణవాలయం కమలాద్రి లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం సిద్ధమైంది.

శాపల్లిలో నేడు నృసింహ జయంతి వేడుకలు
ఆలయం వద్ద 11న గిరిప్రదక్షిణ ప్రారంభం
నార్కట్పల్లి,మే 9(ఆంధ్రజ్యోతి): నృసింహ జయం తి వేడుకలకు నార్కట్పల్లి మండలం శాపల్లిలో గల ప్రసిద్ధ వైష్ణవాలయం కమలాద్రి లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం సిద్ధమైంది. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీన స్వామివారి జయంతి వేడుకల్లో భాగంగా పంచామృతాభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ అనువంశిక అర్చకుడు కారంపూ డి నర్సింహాచార్యులు తెలిపారు.ఈఉత్సవాలకు ఎమ్మె ల్యే వేముల వీరేశంతో పాటు టీటీడీ బోర్డు సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి హాజరుకానున్నారు. గ్రామానికి చెందిన భక్తుడు, ఏపీ బీసీ సంఘర్షణ సమితి అధ్యక్షుడు అక్కెనపల్లి లక్ష్మయ్య దాతగా స్వామివారికి 6 నెలల పాటు పంచామృతాభిషేకాలు చేయనున్నారు.
శాపల్లిలో గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు
దేవస్థానాల వద్ద గిరి ప్రదక్షిణకు ఎంతో విశిష్టత ఉంటుంది. మానసిక,గ్రహ,శారీరక రుగ్మతలతో ఇబ్బం ది పడే బాధితులు ఆలయాల చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే తొలగిపోతాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది. ఇం దులో భాగంగానే యాదాద్రి దేవస్థానంలో ఇటీవలే గి రిప్రదక్షిణ ప్రారంభించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతీనెలా యాదాద్రిలో నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో తొలిసారిగా శాపల్లిలో కూడా కమలాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం చుట్టూ గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు చే స్తున్నారు. ఈనెల 11వ తేదీన గిరిప్రదక్షిణ ప్రారంభించనున్నట్లు కారంపూడి నర్సింహాచార్యులు తెలిపారు.