Minister Ponguleti Srinivas Reddy: సమ్మక్క సారలమ్మ ఆలయ మాస్టర్ ప్లాన్పై సమీక్ష
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:20 AM
సమ్మక్క-సారలమ్మ దేవాలయాన్ని గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ఆధునీకరణను చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్...
గిరిజన సంస్కృతి ప్రకారమే ఆధునికీకరణ పనులు: పొంగులేటి
సమ్మక్క-సారలమ్మ దేవాలయాన్ని గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ఆధునీకరణను చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆధునీకరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్పై సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు బలరామ్ నాయక్తో కలిసి మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల్లో పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు.