సామూహిక వివాహాలను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Sep 07 , 2025 | 10:59 PM
బెల్లంపల్లి తిలక్ వాకర్స్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26న చేపట్టనున్న సామూహిక వివా హాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం సభ్యులు కోరారు. మండల కేంద్రంలో ఆదివారం కరపత్రాలతో ప్రచారం చేశారు. వివాహం చేసే తాహతు లేని నిరుపేదల కోసం ఈ కార్యక్రమాన్ని చేప ట్టామని చెప్పారు.
నెన్నెల, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): బెల్లంపల్లి తిలక్ వాకర్స్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26న చేపట్టనున్న సామూహిక వివా హాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం సభ్యులు కోరారు. మండల కేంద్రంలో ఆదివారం కరపత్రాలతో ప్రచారం చేశారు. వివాహం చేసే తాహతు లేని నిరుపేదల కోసం ఈ కార్యక్రమాన్ని చేప ట్టామని చెప్పారు. బంగారు పుస్తెలు, మెట్టెలు, వధూవరులకు వస్త్రాము లు ఉచితంగా అందజేస్తామన్నారు. తల్లిదండ్రుల అంగీకార పత్రంతో ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జంట తరపున 40 మం ది బందువులకు విందుభోజనం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆసక్తిగల వారు తమను సంప్రదించాలని కోరారు. గెల్లి జయరాం, ఏనుగు రమేష్, బోగ శ్రీనివాస్, రంగ రామన్న, నరేంద్రుల వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.