Share News

kumaram bheem asifabad- కుష్ఠును తరిమేద్దాం

ABN , Publish Date - Dec 20 , 2025 | 10:05 PM

కుష్ఠు వ్యాది ఇది ప్రాణాంతకమైనది కానప్పటికీ నిర్లక్ష్యం చేస్తే శాశ్వత వైకల్యాన్ని కలిగించగల మహమ్మారి. గతంలో అంతంత మాత్రంగానే ఉన్న ఈ వ్యాధి తీవ్రత ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు వైద్యశాఖ అంచనా వేస్తోంది. దీంతో అప్రమత్తమైన జాతీయ ఆరోగ్య మిషన్‌ కుష్ఠు వ్యాధిగ్రస్థులు, లేదా ఆ లక్షణాలు కల్గిన వారి వివరాలను తెలుసుకోవా లని సంకల్పించింది.

kumaram bheem asifabad- కుష్ఠును తరిమేద్దాం
లోగో

- ఈ నెల 31వరకు ఇంటింటా పరిశీలన

- గుర్తింపు అనంతరం మందుల పంపిణీ

బెజ్జూరు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కుష్ఠు వ్యాది ఇది ప్రాణాంతకమైనది కానప్పటికీ నిర్లక్ష్యం చేస్తే శాశ్వత వైకల్యాన్ని కలిగించగల మహమ్మారి. గతంలో అంతంత మాత్రంగానే ఉన్న ఈ వ్యాధి తీవ్రత ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు వైద్యశాఖ అంచనా వేస్తోంది. దీంతో అప్రమత్తమైన జాతీయ ఆరోగ్య మిషన్‌ కుష్ఠు వ్యాధిగ్రస్థులు, లేదా ఆ లక్షణాలు కల్గిన వారి వివరాలను తెలుసుకోవా లని సంకల్పించింది. ఇందులో భాగంగా 14 రోజుల పాటు ఇంటింటా లెప్రసి(కుష్ఠు) సర్వేను చేపట్టాల ని నిర్ణయించింది. డిసెంబరు 18 నుంచి 31వరకు జిల్లా వ్యాప్తంగా వైద్య బృందాలు లెప్రసీ కేస్‌ డిటెక్షన్‌ క్యాంపెయిన్‌(ఎల్‌సీడీసీ) సర్వే చేసేలా ప్రణాళిక రూపొందించారు. సర్వే అనంతరం లక్షణాలు ఉన్న వారికి మందులు ఇస్తూ తరచుగా వారిని పరీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలోనే కుమరం భీం జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులు అధికంగా పెరగడం ఆందోళన కలిగి స్తోంది. ఏటా చర్మవ్యాధి బాధితులు పెరుగుతున్నా రు. చర్మానికి, నరాలకు సోకి ఇబ్బంది పెట్టే కుష్ఠు వ్యాధి చాపకింద నీరులా విస్తరించి భయాందోళ నకు గురి చేస్తోంది. జిల్లాలో ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 95మంది బాధితులు ఉన్నట్లు తేలింది. గత ఏడాది 87ఉండగా, అంతకుముందు 137మందిని గుర్తించి చికిత్స అందించారు.

- బ్యాక్టీరియా ద్వారా..

కుష్ఠు వ్యాధి అనేది మైక్రో బ్యాక్టీరియం లెప్రె, మైక్రో బ్యాక్టీరియం లెప్రమటోసిస్‌ అనే బ్యాక్టీరి యాల ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా ఇది అంటు వ్యాధి. ముఖ్యంగా వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస ద్వారా బ్యాక్టీరియా గాలిలో కలిసి ఇతరుల శరీరంలో చేరుతోంది. శరీరంలోకి చేరిన ఏడు రోజుల వరకు బ్యాక్టీరియా బతికే ఉంటుంది. రోగనిరోదక శక్తి ఎక్కువగా ఉన్న వారి శరీరంలో బ్యాక్టీరియా బతికే అవకాశం తక్కువ. కాగా రోగనిరోదక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ బ్యాక్టీరియా ప్రభావం చూపుతుంది. వ్యక్తి రోగనిరోదక శక్తిని బట్టి ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల సమయం తీసుకుంటుంది. శరీరంపై తెల్లటి, రాగి రంగు మచ్చలు రావడం, ఆ ప్రదేశంలో స్పర్శ తెలియక పోవడం, కాలి, చేతి వేళ్లు తిమ్మిరులుగా ఉండటం కుష్టు వ్యాది అక్షణాలు.

- అరికట్టడం సులువే..

కుష్టు వ్యాధిని సకాలంలో గుర్తించి మందులు వాడితే దానిని అరికట్టడం చాలా సులువు. సమాజంలో ఇప్పటికీ కుష్ఠు వ్యాధిపై రోగుల పట్ల ఒక రకమైన చిన్నచూపు ప్రజల్లో నెలకొంది. కుష్థు వ్యాధి సోకిన రోగిని దూరంగా ఉంచడం, వారిని తాకడానికి ఇష్టపడకపోవడం, వంటి సంఘటనలు ఉన్నాయి. కుష్ఠు వ్యాది పట్ల ఉన్న అపోహ కార ణంగా కుటుంబ సభ్యులు సైతం దూరంగా ఉంచుతున్నారు. మరోవైపు తమకు కుష్ఠు వ్యాది లక్షణాలు ఉన్నాయని తెలిసినప్పటికీ బయటివారు ఏమనుకుంటారో అన్న న్యూనతాభావంతో బయట కు చెప్పుకోవడం లేదు. దీంతో వ్యాధి తీవ్రత పెరు గుతోంది. తీవ్రత పెరిగితే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది. ఫలి తంగా శరీరంలో అతి ముఖ్యమైన 6 ప్రధాన నరాలు(పెరిఫెరల్‌) దెబ్బతినడం ప్రారంభి స్తాయి. దీంతో కాళ్లు, చేతుల వేళ్లు ముడుచుకపోవడం, కుదించుకుపోవడం, చేతులు, కాళ్లలో సత్తువ కోల్పోయి వాలిపోవడం జరుగుతుంది. ఇది శాశ్వత వైకల్యానికి దారి తీస్తుంది. కుష్ఠు వ్యాధిని గుర్తించి మందులు వాడితే 6 నెలల నుంచి ఏడాదిన్నర లోగా పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 95మంది కుష్ఠు వ్యాధి బారిన పడ్డారు. వారందరికి వైద్యం చేయిస్తున్నారు.

- కట్టడి చేసేందుకే..

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి సమాజంలో కుష్ఠు వ్యాధి పట్ల ప్రజలకు ఉన్న భావాన్ని రూపుమా పడంతో పాటు భూమ్మీద కుష్టువ్యాధి అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమాన్ని 1983లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో కుష్ఠు విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిం ది. ఏటా వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించడం, వారికి మందులు పంపిణీ చేసి, వ్యాధి తగ్గే వరకు పర్యవేక్షించడం ఎన్‌ఎల్‌ఈపీ లక్ష్యం. జిల్లా వ్యాప్తంగా ఒక జిల్లా ఆసుపత్రి, ఐదు సామాజిక ఆసుపత్రు లు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిఽ దిలో ఆశా కార్యకర్తల ద్వారా ఈ సర్వే చేయిస్తు న్నారు. కానీ ఈసారి ఆశాలు సర్వే చేయించాల్సి ఉండగా, గతంలో సర్వే చేసిన సమయంలో ఆశాలకు సర్వే వేతనాలు ఇవ్వలేదని వారంతా సర్వేకు నిరాకరిం చారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్య సిబ్బందితోనే కుష్ఠు వ్యాధి సర్వేను చేయిస్తున్నారు. వ్యాధి లక్షణాలున్న వారి వివరాలను ఏఎన్‌ఎంల ద్వారా పీహెచ్‌సీ వైద్యాధికా రికి, అక్కడి నుంచి జిల్లా వైద్యశాఖ కార్యాలయానికి పంపిస్తారు. 14 రోజుల సర్వే ముగిసిన తర్వాత లక్షణాలున్న వారిని పీహెచ్‌సీలకు రప్పించి పూర్తి స్థాయిలో పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. వ్యాధి నిర్ధారణ అయితే మందులు ఇచ్చి పంపి స్తారు. ఇలా ప్రతీ నెలా వారిపై ఆశా కార్యకర్తల పర్యవేక్షణ ఉంటుంది.

- అవగాహన సమావేశాలు..

సాధారణంగా కుష్ఠు వ్యాధి లక్షణాలు ఉన్నవారు బయటకు చెప్పుకోరు. తమ ఇంట్లో అలాంటి వారు ఎవరూ లేరంటూ పర్వేకు నిరాకరిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏ ఒక్కరిని వదలకుండా పరీ ించాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటోం ది. సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, పురప్రము ఖులు, ఉద్యోగులు, యువజన సంఘాల వారితో సమావేశాలు ఏర్పాటు చేసి కుష్టువ్యాది పట్ల అవగాహన కల్పించాలని భావిస్తోంది. డిసెంబరు 18నుంచి కుష్టుపై సర్వే ప్రారంభించారు. దీంతో పాటు గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో వ్యాధిని నిర్మూళించేందుకు ఏటా అవగాహన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు.

సకాలంలో గుర్తిస్తే తగ్గించడం సులువే..

- శ్యాంలాల్‌, జిల్లా కుష్ఠు వ్యాధి నిర్మూళన కో ఆర్డినేటర్‌

కుష్ఠు వ్యాధిని సకాలంలో గుర్తించి మందులు వాడితే సులువుగా తగ్గించవచ్చు. ఈ వ్యాధిపై అపోహలు వీడి చికిత్స చేయించుకోవాలి. జిల్లాలో ఎంత మందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయనే సమా చారాన్ని తెలుసుకొని వారికి చికిత్స అందించాలనే లక్ష్యంతో లేప్రసి సర్వే చేపడుతున్నాం. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఇంటికి వచ్చే వై ద్య సిబ్బందికి సహకరించి లక్షణాలున్న వారు చెప్పాలి. సర్వే అనంతరం లక్షణాలున్న వారికి మందులు ఇచ్చి వ్యాధి తగ్గే వరకు పర్యవేక్షిస్తాం.

Updated Date - Dec 20 , 2025 | 10:05 PM