న్యాయవాదుల విధులు బహిష్కరణ
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:12 PM
హైదరాబాద్ కూకట్ పల్లిలో న్యాయవాది శ్రీకాంత్పై దాడికి నిరసనగా లక్షెట్టిపేట పట్టణ న్యాయస్థానంలో న్యాయవా దులు మంగళవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేసారు. బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న మాట్లాడుతూ న్యాయవాదులకు రోజు రోజుకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు న్యాయవాదులకు ప్రత్యేకంగా రక్షణ చట్టం ఏర్పాటు చే యాలని కోరారు.
విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు
లక్షెట్టిపేట, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కూకట్ పల్లిలో న్యాయవాది శ్రీకాంత్పై దాడికి నిరసనగా లక్షెట్టిపేట పట్టణ న్యాయస్థానంలో న్యాయవా దులు మంగళవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేసారు. బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న మాట్లాడుతూ న్యాయవాదులకు రోజు రోజుకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు న్యాయవాదులకు ప్రత్యేకంగా రక్షణ చట్టం ఏర్పాటు చే యాలని కోరారు. ఈకార్యక్రమంలో ప్రధానకార్యదర్శి ప్రదీప్కు మార్, ఉపాద్యక్షుడు నళినికాంత్, సీనియర్ న్యాయవాదులు రాజే శ్వర్రావు, కారుకూరి సురేందర్, అక్కల శ్రీధర్, సత్య నారాయణ, తిరుపతి స్వామి, రవీందర్, సదాశివ, న్యాయవాదులు ప్రకాశం, పద్మ, సజని పాల్గొన్నారు.
మంచిర్యాలక్రైం: మంచిర్యాల బార్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో కోర్టు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. సో మవారం కూకట్పల్లి హైదరాబాద్ కోర్టు బార్ అసోసియషన్ ఈసీ నెంబర్ న్యాయవాది తన్నీరు శ్రీకాంత్పై ప్రతివాదులు దా డి చేసి తీవ్ర గాయపరిచినందుకు నిరసనగా తెలంగాణ ఫెడ రేషన్, బార్ అసోసియేషన్ పిలుపు మేరకు విధులు బహిష్కరిం చినట్టు తెలిపారు. ఈకార్యక్రమంలో భుజంగరావు, రంజిత్గౌడ్, పులి రాజమల్లు పాల్గొన్నారు.