కృష్ణాబోర్డు సభ్యుడిగా కె.కె.జంగిడ్
ABN , Publish Date - May 31 , 2025 | 04:16 AM
కృష్ణా యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సభ్యునిగా శంఖువ స్థానంలో కె.కె.జంగిడ్ను నియమితులైయ్యారు.
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): కృష్ణా యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సభ్యునిగా శంఖువ స్థానంలో కె.కె.జంగిడ్ను నియమితులైయ్యారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత బోర్డు మెంబర్ శంఖువ శనివారం పదవీ విరమణ చేయనున్నారు. తాజా నియామక ఉత్తర్వులు జూన్ 1 నుంచి అమలల్లోకి రానున్నాయి.
17 మంది మావోయిస్టుల లొంగుబాటు
కొత్తగూడెం, మే 30 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్సగఢ్కు చెందిన 17 మంది మావోయిస్టు సభ్యులు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ సమక్షంలో లొంగిపోయారు. వారికి ప్రభుత్వం తరపున రూ.25 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. కొత్తగూడెం ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ రోహిత్రాజ్ మాట్లాడుతూ.. జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా ఛత్తీ్సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన 17 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారిలో ఆరుగురు మహిళలు, 11 మంది పురుషులున్నారని తెలిపారు. జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 288 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు.