Minister Kavitha: కవిత వల్లే కానుకుర్తి రైతులకు పరిహారం పెంపు
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:42 AM
కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.20లక్షల..
తెలంగాణ జాగృతి వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.20లక్షల పరిహారం ప్రకటించడం తాము సాధించిన విజయమని తెలంగాణ జాగృతి సంస్థ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రాజెక్టు కోసం రైతుల భూములు గుంజుకొని ఎకరాకు రూ.14లక్షల పరిహారం మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం చూసిందని, దీనిపై రూ.20 లక్షల పరిహారం ఇేస్త తప్ప భూములిచ్చేది లేదని కవిత చేపట్టిన పోరాటానికి దిగొచ్చి.. పరిహారాన్ని పెంపు చేసిందన్నారు.