Share News

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

ABN , Publish Date - May 11 , 2025 | 11:10 PM

దండేపల్లి మండలం రంగంపల్లి గ్రామం లో ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ధ్యానం కొనుగోలు కేం ద్రాలను మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ ఆదివారం పరిశీ లించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

దండేపల్లి, మే 11(ఆంధ్రజ్యోతి): దండేపల్లి మండలం రంగంపల్లి గ్రామం లో ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ధ్యానం కొనుగోలు కేం ద్రాలను మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ ఆదివారం పరిశీ లించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు పంపించాలని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువ లను వెంటనే ఖాళీ చేసే ప్రయత్నం చేయాలన్నారు. ఇప్పటి వరకు కొనుగో లు చేసిన ధాన్యం వివరాలు అదే విధంగా ఇంకా తూకం వేయాల్సిన ధా న్యం వివరాలను కేంద్రం నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు. మిల్లులకు వచ్చిన ధాన్యంను కూలీల సంఖ్య పెంచి వెంటనే దింపుకోవాలని మిల్లర్లను ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఆయన వెంట ఆర్‌ఐ బూమన్న, కేంద్రం నిర్వహకులు, రైతులు ఉన్నారు.

Updated Date - May 11 , 2025 | 11:10 PM