టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడికి సన్మానం
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:25 PM
టీఎన్జీవో కేంద్రం సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ సోమవారం మంచిర్యాలకు రాగా టీ ఎన్జీవో నాయకులు ఆయనను ఘనంగా శాలువాలతో సన్మానించారు. పుష్ప గుచ్చాలు అందించారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : టీఎన్జీవో కేంద్రం సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ సోమవారం మంచిర్యాలకు రాగా టీ ఎన్జీవో నాయకులు ఆయనను ఘనంగా శాలువాలతో సన్మానించారు. పుష్ప గుచ్చాలు అందించారు. జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ప్రతి ఉద్యోగికి 17 శా తం హెచ్ఆర్ఏ ఇవ్వడానికి ఫైనాన్స్ డిపార్టుమెంట్తో చర్చించి త్వరగా వ చ్చేలా చూడాలన్నారు. ఇందుకు జగదీశ్వర్ సానుకూలంగా స్పందించినట్లు తె లిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామ్మోహన్, కేంద్ర సంఘం కా ర్యదర్శి మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షుడు రాంకుమార్, తిరుపతి, గోపాల్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.