ఉద్యోగులకు త్వరలో ఆరోగ్య కార్డులు
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:26 PM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ త్వర లో ఆరోగ్య కార్డులు అందుతాయని పీఆర్ టీయూ తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి అన్నారు.
- పీఆర్టీయూ తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి
తిమ్మాజిపేట,సెప్టెంబరు21 (ఆంధ్రజ్యో తి) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ త్వర లో ఆరోగ్య కార్డులు అందుతాయని పీఆర్ టీయూ తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి అన్నారు. తిమ్మాజిపేట మండ ల కేంద్రంలో ఆదివారం పదోన్నతులు బది లీలు పొందిన ఉపాధ్యాయులకు పీఆర్టీ యూ తెలంగాణ సంఘం సభ్యులు జయ పాల్రెడ్డి, పానుగంటి శేఖర్ల ఆధ్వర్యంలో శా లువాలు కప్పి ఘనంగా సన్మానించారు. సాయిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూలే ని విధంగా ఉపాధ్యాయులకు బదిలీలు, పదో న్నతులు ఇప్పించిన ఘనత తమ సంఘానికి దక్కుతుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎప్పుడూ తోడుగా అం డగా ఉంటుందన్నారు. పీఆర్టీయూ తెలంగాణ నాయకులు శివరాంగౌడ్, సాంబయ్య, అశోక్, బిజినేపల్లి, తాడూరు ఉపాధ్యాయులు శివశంక ర్, రాజు ఉన్నారు.