స్థానిక సమరానికి గ్రీన్సిగ్నల్
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:19 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం పూ ర్తిగా సన్నద్ధమైంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్ల లో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, ఆ తరువా త సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించనున్నారు.
స్థానికంలో 3.7 లక్షల పై చిలుకు ఓటర్లు...
-ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు బిజీ
-ఓటరు తుది ముసాయిదా జాబితా విడుదల
-మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు...!
-త్వరలో నోటిఫికేన్ జారీకి ఈసీ సన్నాహాలు
మంచిర్యాల, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం పూ ర్తిగా సన్నద్ధమైంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్ల లో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, ఆ తరువా త సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించనున్నారు. స్థానిక సం స్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ త్వర లో షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోం ది. గ్రామ పంచాయతీల పాలన గత సంవత్సరం జన వరిలో ముగియగా, జిల్లా పరిషత్, మండల పరిషత్ల పాలక వర్గాల పదవీకాలం జూలైతో ముగిసింది. దీంతో స్థానిక సంస్థల పాలన ప్రత్యేకాఽధికారుల చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కు ఈసీ సిద్ధం కాగా ఎలక్షన్లకు సంబంధించి కీలక ఆ దేశాలు జారీ చేసింది. ఇప్పటికే పీవోలు, ఏపీవోలు, రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తికాగా, శిక్షణ తరగతులు కూడా ముగిశాయి.
306 పంచాయతీల పరిధిలో ఎన్నికలు....
స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జి ల్లాలోని 306 గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామా ల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో రెండు పం చాయతీ డివిజన్లలో 16 మండలాలు ఉన్నాయి. ఎంపీ టీసీ స్థానాలు 129 ఉన్నాయి. గతంలో 130 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మున్సిపల్ కార్పొరేషన్లో మూడు స్థానాలు విలీనం అయ్యాయి. కొత్తగా భీమిని, భీమారం మండలాల్లో అధనంగా రెండు స్థానాలను పెంచగా, మొత్తం ఎంపీటీసీ స్థానాల సంఖ్యకు 129కి చేరింది. అ లాగే జడ్పీటీసీ స్థానాలు 16, ఎంపీపీ స్థానాలు 16 ఉ న్నాయి. వీటికిగాను తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్ని కలు నిర్వహించనుండగా, అవసరమైన బ్యాలెట్ బాక్సు లు, ఇతర సామగ్రి జిల్లాకు ఇప్పటికే చేరింది. ఎంపీ టీసీ ఎన్నికల కోసం గులాబీ, జడ్పీటీసీ పోలింగ్ కోసం తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్నారు.
నామినేషన్ దాఖలులో నిబంధనలు...
ఇంతకు పూర్వం ఒక అభ్యర్థి అనేక పదవుల కోసం పోటీపడే అవకాశం ఉండేది. ఇప్పుడు ఒక అభ్యర్థి ఒక్క పదవికే పోటీ చేయాలనే నిబంధనను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో ఒక అభ్యర్థి ఒకేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పోటీచేసే అ వకాశం ఈసారి ఉండే అవకాశాలు లేవు. రాష్ట్రంలో రి జర్వేషన్ల అంశం ఇంకా తేలకపోయినా, ఎన్నికలు ఎ ప్పుడు వచ్చినా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరిలో రూపొం దించిన ఓటరు జాబితాలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసి, తుది జాబితా ముసాయిదాను ఇటీవల విడుదల చేశారు. అయితే ఎన్నికల నాటికి కొత్తగా ఓ టరు జాబితాలో నమోదు చేసుకొనే అవకాశం కూడా యువతకు కల్పించారు. అలాగే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో నోటా విధానానికి ఈసీ శ్రీకారం చుడుతోంది. 2004 నుంచి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో అమలు చేస్తున్న నోటా ఇక మీదట స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అమలు చేయనున్నారు.
జిల్లాలో ఓటర్ల సంఖ్య
పంచాయతీ ఎన్నికలకు గాను అధికారులు రూపొం దించిన తుది ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 3,76,669 ఓటర్లు ఉన్నారు. వీరిలో స్త్రీలు 1,91,011 మం ది ఉండగా, పురుషులు 1,85,643, ఇతరులు 15 మంది ఓటర్లు ఉన్నారు. మండలాల వారీగా ఓటర్ల సంఖ్య ఇలా....
మండలం ఓటర్లు పురుషులు స్త్రీలు ఇతరులు
బెల్లంపల్లి 23,464 11,625 11,838 01
భీమిని 11,529 5844 5684 01
భీమారం 13,093 6394 6699 00
చెన్నూరు 26,475 13,040 13,435 00
దండేపల్లి 42,101 20,486 21,614 01
హాజీపూర్ 16,954 8361 8593 00
జైపూర్ 30,626 15,278 15,347 01
జన్నారం 44,412 21,670 22,740 02
కన్నెపల్లి 15,490 7,614 7,875 01
కాసిపేట 26,472 13,127 13,342 03
కోటపల్లి 26,990 13,320 13,668 02
లక్షెట్టిపేట 25,227 12,261 12,966 00
మందమర్రి 11,482 5678 5803 01
నెన్నెల 19,371 9636 9734 01
తాండూరు 27,757 13,741 14,016 00
వేమనపల్లి 15,226 7568 7657 01