మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
ABN , Publish Date - Aug 15 , 2025 | 11:47 PM
దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించినా మహానీ యులను యువత ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రఘనాథ్ వెరబెల్లి అన్నారు. హర్ ఘర్ తిరంగా స్వాతంత్రం దినోత్సవం పురస్కరించుకోని దండేపల్లిలో జాతీయ జెండాను ఆయన ఆవిష్క రించిన అనంతరం తిరంగా బైక్ ర్యాలీ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఆవిష్కరించి జాతీయ భావం చాటాలని పిలుపునిచ్చారు.
దండేపల్లి ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించినా మహానీ యులను యువత ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రఘనాథ్ వెరబెల్లి అన్నారు. హర్ ఘర్ తిరంగా స్వాతంత్రం దినోత్సవం పురస్కరించుకోని దండేపల్లిలో జాతీయ జెండాను ఆయన ఆవిష్క రించిన అనంతరం తిరంగా బైక్ ర్యాలీ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఆవిష్కరించి జాతీయ భావం చాటాలని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వికసిత్ భారత్ దిశగా గత 11 ఏళ్లుగా దేశం కోసం పని చేస్తుంది బీజేపీ ప్రభుత్వమే న్నారు. భారత్ దేశం మోదీతోనే అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. దం డేపల్లి నుంచి మ్యాదరిపేట, తాళ్లపేట, గూడెం రింగ్ రోడ్డు గుండా తిరంగా బైక్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షకార్యదర్శు రవిగౌడ్, సంతో ష్, అనిల్, మాజీ అధ్యక్షుడు రాజయ్య, నాయకులు దిలీప్, శేఖర్, వెంకటేశ్వర్లు, సురేం దర్, కిషన్, రవీందర్, అశోక్, మల్లేష్, వెంకటేష్, రాకేష్, సురేందర్, నర్సింగ్, విజయందర్, హరికృష్ణ, సత్తయ్య, ఉమేష్, సత్తయ్య పాల్గొన్నారు.
కోటపల్లి : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగాలో భా గంగా శుక్రవారం బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రం నుంచి సర్వాయిపేట, ఎసన్వాయి, ఎడగట్ట, పిన్నారం మీదుగా పారుపెల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సెక్రటరీ దుర్గం అశోక్ మాట్లాడు తూ స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అవుతున్నా పల్లెల్లో పరిస్థితులు మారలేదని, రో డ్లు లేక గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండ ల అధ్యక్షురాలు పెద్దింటి స్వప్నపున్నంచంద్, ఎన్నికల కన్వీనర్ మంత్రి రామ య్య, జనరల్ సెక్రటరీలు కందుల వెంకటేష్, వడ్లకొండ రాజేష్, సీనియర్ నాయ కుడు నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షులు సంపత్, లక్ష్మణ్, తిరుపతి, బూత్ అధ్యక్షుడు శ్యాంసుందర్, రాకేష్, నర్సింహులు, చంద్రయ్య, రాజేందర్, మహేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.