Share News

రక్తదాతలు.. సేవాతత్పరులు: గవర్నర్‌

ABN , Publish Date - Jun 15 , 2025 | 05:31 AM

రక్తదానాన్ని మానవత్వంతో నిరంతర సేవగా కొనసాగించడం గొప్ప విషయమని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దాతలను అభినందించారు.

రక్తదాతలు.. సేవాతత్పరులు: గవర్నర్‌

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): రక్తదానాన్ని మానవత్వంతో నిరంతర సేవగా కొనసాగించడం గొప్ప విషయమని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దాతలను అభినందించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌ కమ్యూనిటీ హాలులో రెడ్‌క్రాస్‌ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గవర్నర్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానాన్ని ప్రోత్సహించే విధంగా ఎప్పటికప్పుడు శిబిరాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థల సేవలను కొనియాడారు.

Updated Date - Jun 15 , 2025 | 05:31 AM