ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:49 AM
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో అర్హులైన 89మంది లబ్ధదారు లకు 29లక్షల 33వేల విలువ గల ముఖ్యమంత్రి సహా య నిది చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదా రులకు సోమవారం
చందుర్తి, జూన్ 9, (ఆంధ్ర జ్యోతి): ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో అర్హులైన 89మంది లబ్ధదారు లకు 29లక్షల 33వేల విలువ గల ముఖ్యమంత్రి సహా య నిది చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదా రులకు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడి కల్ హబ్గా మారిందన్నారు. వైద్యారోగ్య రంగంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారింద నన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచారన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో 25 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నేడూ 18 ఇడ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. చందుర్తి మండల పరిధిలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ చేయాలని సూచించారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజి జడ్పిటిసి సభ్యుడు నాగం కుమార్, మండల కాంగ్రెస్ అధ ్యక్షుడు చింతపంటి రామస్వామి, నాయకులు ఎన్గంటి శంకర్, లింగంపెల్లి సత్తయ్య, గొట్టె ప్రభాకర్, పులి సత్తయ్య, సంటి ఏసుదాసు, నాగుల శంకరయ్య ఉన్నారు.
సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిది
కోనరావుపేట : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం అందజేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ 56 మంది లబ్ధదారులకు 18 లక్షల 37 వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కు లను అందజేశామన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఫిరోజ్పాషా, తహసీల్దార్ వరలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు నాయిని ప్రభా కర్ రెడ్డి, చేపూరి గంగాధర్, బుర్ర రవీందర్, రుక్మిణి, పెం తుల శ్రీనివాస్, మానక సత్యం పాల్గొన్నారు.