Share News

ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Oct 17 , 2025 | 11:05 PM

ఆదివాసీల సంక్షేమానికి కాంగ్రె స్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రా ష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ డెవ లప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొట్నాక తిరుపతి అన్నారు. మండలంలోని గుడి రేవులో పద్మల్‌పూరీ కాకో ఆలయంలో శుక్రవారం నిర్వహించిన గుస్సాడి దర్బా ర్‌ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు

  ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
గుడిరేవు గుస్సాడి దర్బార్‌లో ప్రసగిస్తున్న గిరిజన కార్పోరేషన్‌ ఛైర్మన్‌ కోట్నాక తిరుపతి

గుస్సాడి దర్బార్‌లో గిరిజన కార్పొరేషన్‌ చైర్మన్‌ తిరుపతి

దండేపల్లి అక్టోబరు 17 (ఆంధ్ర జ్యోతి): ఆదివాసీల సంక్షేమానికి కాంగ్రె స్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రా ష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ డెవ లప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొట్నాక తిరుపతి అన్నారు. మండలంలోని గుడి రేవులో పద్మల్‌పూరీ కాకో ఆలయంలో శుక్రవారం నిర్వహించిన గుస్సాడి దర్బా ర్‌ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా ఆలయ కమి టీ ఆఽధ్వర్యంలో గిరిజన సంప్రదాయబ ద్దంగా ఘన స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ ఆదివాసీ సంప్రదాయల కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంద న్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ కోమురం హన్మంత్‌పటేల్‌, ఆల య నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఆత్రం జ లపతి, మాజీ ఆలయ కమిటీ చైౖర్మన్‌ కు డిమేత సోము, గిరిజన నాయకులు జం గు, గోపి, లింగారావు, శ్రీనివాస్‌, కాంత రావు, తిరుపతి, సంతోష్‌ పాల్గొన్నారు.

అంబారన్నంటిన దండారీ సంబరాలు

దండారీ ఉత్సవాల్లో భాగంగా ఆల యం వద్ద గుస్సాడీ నృత్యాలు చేస్తూ దండారీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. నియమ నిష్టలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద రకౄరకాల పిండిపదార్ధలు తయారు చే సి కోళ్లలను, మేకలను అమ్మవారికి బలి ఇచ్చి కుటుంబ సమేతంగా సంహప్తకి విందు భోజనం గిరిజనులు ఆరగించా రు. ఎమ్మెల్యే కోక్కిరాల ప్రేమ్‌సాగర్‌ రా వు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వ ర్యంలో ఆలయం వద్ద అన్నదానం వితర ణ చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ క మిటీ నిర్వాహకులు, కమిటీ సభ్యులు, ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2025 | 11:05 PM