వైద్యరంగానికి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:25 PM
లంగాణ రా ష్ట్రంలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేస్తుందని కల్వకుర్తి ఎమ్మె ల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నా రు.
- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రా ష్ట్రంలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేస్తుందని కల్వకుర్తి ఎమ్మె ల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నా రు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించ డానికి కల్వకుర్తికి వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని పలువురికి మంజూరైన సీఎంఆర్ ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి గురువారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.