kumaram bheem asifabad- రైతులకు ఇబ్బందులు రానియోద్దు
ABN , Publish Date - Oct 28 , 2025 | 10:04 PM
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మాంతయ్య, కాగజ్నగర్, జైనూరు మార్కెట్ కమిటీ చైర్మనలు దేవయ్య, విశ్వనాథ్లతో, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్, రవాణా ప్రాథమిక సహకార, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు
ఆసిఫాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మాంతయ్య, కాగజ్నగర్, జైనూరు మార్కెట్ కమిటీ చైర్మనలు దేవయ్య, విశ్వనాథ్లతో, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్, రవాణా ప్రాథమిక సహకార, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం వరి ధాన్యం, పత్తి, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు 40 కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఆయా కేంద్రాల్లో రైతులకు కొరకు తాగునీరు, నీడ, కనీస మౌలిక వసతులు, టార్పాలిన్ కవర్లు, గోనె సంచులు, ప్యాడి క్లీనర్లు, తేమ యంత్రాలు, ఎలకా్ట్రనిక్ తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తు ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలని, ఐతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తరువాత కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చే విధంగా వ్యవసాయ విస్తరణ అధకారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆరిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు. పత్తి కొనుగోళ్లలో ఈ సారి కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నందున ప్రతి రైతుకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతుల వివరాలను యాప్లో నమోదు చేయాలని తెలిపారు.. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం యూరియా కొరత ఉన్నప్పటికీ వ్యవసాయ అదికారులు సమన్వయంతో వ్యవహరించి రైతులకు యూరియా సకాలంలో అందించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లలో క్రియాశీలకంగా వ్యవహరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పని చేయాలని కోరరారరు. సిర్పూర్ నియోజక వర్గంలోని కౌటాలలో ఒకటి, దహెగాంలో ఒకటి వరి కొనుగోలు కేంద్రాలను అదనంగా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకటి, మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న అంగవైకల్య నిర్ధారణ కేంద్రాన్ని కలెక్టర్ వెంకటేష్ దోత్రే మంగళ వారం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగవైకల్యం నిర్ధారణ కేంద్రంలో అవసర మైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. అంగవైకల్యం కలిగిన పెన్షదారుల పునరుద్ధరణ కోసం నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి అంగవైకల్య నిర్ధారణ చేసి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిర్ధారణ కేంద్రంలో అంగవైకల్యం కలిగిన వారికి, సహాయకులుగా వచ్చే వారి కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పరీక్ష పరికరాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నిర్ధారణ కేంద్రానికి వచ్చే దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు తల్తెతకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి అదికారి దత్తారాం, ఆసుపత్రి పర్యవేక్షకులు, సంబంధిత అధికారులు ఉన్నారు.