Presiding Officers Suspension: బ్యాలెట్ పేపర్లు బహిర్గతం ఘటనలో ఎనిమిది మంది పీవోల సస్పెన్షన్
ABN , Publish Date - Dec 14 , 2025 | 07:04 AM
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ఓ మురుగు కాలువలో బ్యాలెట్ పేపర్లు బహిర్గతం అయిన ఘటనలో పోలింగ్ కేంద్రంలో...
చిట్యాలరూరల్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ఓ మురుగు కాలువలో బ్యాలెట్ పేపర్లు బహిర్గతం అయిన ఘటనలో పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించిన ఎనిమిది మంది పీవో (ప్రిసైడింగ్ ఆఫీసర్) లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు ఈ ఘటనపై చిట్యాల ఎంపీడీవో ఎస్.పి.జయలక్ష్మి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎండీవో, ఆర్వో, ఇతర సిబ్బంది సమక్షంలో ఆర్డీవో అశోక్రెడ్డి విచారణ నిర్వహించారని, పోలైన ఓట్లకు, కౌటింగ్ సమయంలో ఉన్న ఓట్లు సరిపోయాయని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి, గెలిచిన అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే ఈ ఘటన జరిగిందని స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు.