అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:28 PM
మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవా రం మండలంలోని టేకులపల్లి గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్డ నిర్మాణ పను లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.

కన్నెపల్లి, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) : మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవా రం మండలంలోని టేకులపల్లి గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్డ నిర్మాణ పను లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల లు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి రిజిష్టర్లను, పరిసరాలను పరిశీ లించారు. విద్యార్థులకు నూతన మెను ప్రకారం పౌష్టికాహారం అందించా లన్నారు. పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించా రు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ ప నులను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రిజిష్టర్ లు, రికార్డులను తనిఖీ చేశారు. ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి హె ల్ప్ డెస్క్ వద్ద రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించా రు. ఆయన వెంట తహసీల్దార్, ఎంపీడీవో, ఇతర అధికారులు ఉన్నారు.